Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Naivaydyalu
Naivaydyalu
Naivaydyalu
Ebook205 pages1 hour

Naivaydyalu

Rating: 5 out of 5 stars

5/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100908
Naivaydyalu

Read more from Sree Chakra Publishers

Related to Naivaydyalu

Related ebooks

Reviews for Naivaydyalu

Rating: 5 out of 5 stars
5/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Naivaydyalu - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    వివిధ రకాల పిండి వంటలు - స్వీట్స్

    Naivaydyalu

    Author:

    శ్రీ చక్ర ప్రచురణకర్తలు

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author/jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.
    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    వివిధ రకాల పిండి వంటలు - స్వీట్స్
    సంకలనం
    లక్ష్మీగణపతి శాస్త్రి

    శ్రీ చక్ర 'ఇ' పబ్లిషర్స్

    వినాయక చవితి

    ఉండ్రాళ్ళు

    కావలసినవి -

    బియ్యపుపిండి లేదా బియ్యం రవ్వ - రెండు కప్పులు,

    బెల్లం - ఒక కప్పు, నీరు - ఒక కప్పు

    పచ్చిశనగపప్పు - రెండు టీ స్పూన్లు,

    తయారు చేసుకునే విధానం -

    బియ్యం ముందురోజు రాత్రి నానబెట్టి గుడ్డ మీద వేసి ఆరనివ్వాలి. నీరంతా ఇంకిపోయి, బియ్యం పొడిగా అయినాక, మిక్సీలో వేసి రవ్వగా చేసుకోవాలి. బియ్యప్పిండితో ఉండ్రాళ్ళు చేసుకునే వారు పిండిగా చేసుకోవచ్చు. స్టా మీద బాణలి పెట్టి తగినన్ని నీళ్ళు పోసి మరిగించి అందులో బెల్లం వేసి కరిగేదాక కలియతిప్పాలి. తరువాత శనగపప్పు, బియ్యంపిండి లేదా రవ్వ వేసి గట్టిపడేదాక కలపాలి. దీనిని చిన్న చిన్న ఉండలు చేసుకుని ఆవిరి మీద ఉడికించాలి. అంతే... బొజ్జ గణపయ్యకు ప్రీతిపాత్రమైన తియ్యని, కమ్మనైన ఉండ్రాళ్లు తయారవుతాయి.

    కుడుములు

    కావలసినవి -

    బియ్యపుపిండి - ఒక కప్పు, కొబ్బరిముక్కలు - పావు కప్పు, బెల్లం - ముప్పావు కప్పు, నీరు - రెండు కప్పులు నూనె - ఒక స్పూను, ఏలకుల పొడి - పావు స్పూను

    తయారు చేసుకునే విధానం -

    బియ్యప్పిండిలో ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. బెల్లంలో ఒక కప్పు నీళ్ళు పోసి కరిగించి వడకట్టాలి. నాన్ స్టిక్ పాన్లో కరిగించిన బెల్లం వేసి మరిగించాలి. ఇప్పుడు బియ్యంపిండి, కొబ్బరి ముక్కలను, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న మంటపై కొంచెం గట్టి పడేవరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత సైజు ఉండలుగా చేసుకోవాలి. వీటిని ఇడ్లీ ప్లేట్ కి కొంచెం నూనె రాసి అందులో పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఆవిరిమీద ఉడికించి దించుకోవాలి.

    పప్పుల ఉండ్రాళ్ళు

    కావలసినవి -

    బియ్యపుపిండి - ఒక కప్పు, నీరు - తగినన్ని పప్పుకోసం పెసరపప్పు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు యాలకుల పొడి - అరచెంచా

    తయారు చేసుకునే విధానం –

    బియ్యం పిండిలో నీళ్ళు పోసి గట్టి పిండి తయారు చేసుకుని, దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉడికించాలి. ఉడికిన ఉండలను తీసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు లో తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన పెసరపప్పులో బెల్లం పొడిగొట్టి వేసుకోవాలి. పప్పు సౌ మీద ఉండగానే ఉడికిన ఉండలను వేసి 2 నిమిషాలు ఉడకనిచ్చి యాలకుల పొడివేసి స్టా మీద నుంచి దించాలి.

    పాలతాలికలు

    కావలసినవి -

    పాలు - ఒక లీటరు, నీరు - ఒక లీటరు సగ్గుబియ్యం -100 గ్రాములు, బియ్యంపిండి - 100 గ్రాములు మైదాపిండి-100 గ్రాములు, పంచదార - 200 గ్రాములు బెల్లం - పావుకేజి, జీడిపప్పు - కొద్దిగా, కిస్ మిస్ - కొద్దిగా ఏలకులపొడి - ఒక టీ స్పూను, నెయ్యి - కొద్దిగా

    తయారు చేసుకునే విధానం -

    పాలలో నీటిని కలిపి మరిగించాలి. పొంగురాగానే అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదార వేసి సగ్గుబియ్యం ఉడుకుతున్న తేటతో (సగ్గుబియ్యం రాకుండా పాలు మాత్రమే) చక్కిలాల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చక్కిలాలను ఒత్తినట్లు మరుగుతున్న పాలలోకి ఒత్తాలి. ఇవే తాలికలు. ఇవి పాలలోనే ఉడుకుతాయి. ఒక తీగ మరొక తీగ మీద పడకుండా విడివిడిగా వచ్చేటట్లు చూడాలి. ఒకదాని మీదకొకటిగా పడితే ఉడికేటప్పుడు కలిసి ముద్దవుతాయి. తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, ఏలకుల పొడిని వేసి కలపాలి. ఇప్పుడు పైన రెండు స్పూన్లు నెయ్యి వేసి ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్ మిస్ తో అలంకరించాలి.

    పాల ఉండ్రాళ్ళు

    కావలసినవి -

    బియ్యపుపిండి - ఒక కప్పు, చక్కెర - ఒక కప్పు పాలు - ఒక కప్పు, యాలకుల పొడి - పావు టీ స్పూను నీళ్ళు - 1 1/2 కప్పులు, తురిమిన పచ్చి కొబ్బరి-ఒక కప్పు వేయించి పొడి కొట్టిన తెల్ల నువ్వుల పొడి-అరకప్పు

    తయారు చేసుకునే విధానం -

    రెండు కప్పుల నీటిని గిన్నెలో పోసి బాగా మరగనివ్వాలి. బియ్యప్పిండిని వేసి, బాగా కలియదిప్పి, వెంటనే గిన్నెపై మూత పెట్టాలి. సన్నని సెగమీద 4-5 నిముషాల పాటు ఉడకనివ్వాలి. విడిగా గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి. చిన్న ఉండలు చేసి ప్లేటుతో విడిగా పెట్టుకోవాలి. మరొక గిన్నెలో చక్కెర వేసి, నీటిని పోసి మరగనివ్వాలి. సెగ తగ్గించి, కొబ్బరితురుము వేసి కొద్ది సేవు కలపాలి. బియ్యప్పిండి ఉండలను కూడా వేసి బాగా కలియ దిప్పాలి. రెండు నిముషాల తరువాత కప్పు పాలను పోసి, ఉండలను అందులో వేసి 5 నిముషాల సేపు ఉడకనివ్వాలి. మెత్తగా నూరిన నువ్వుల పొడి, ఏలకుల పొడి వేసి కలపాలి. స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి.

    చలివిడి

    కావలసినవి -

    బియ్యం - రెండు కప్పులు, బెల్లం లేదా పంచదార - కప్పు కొబ్బరి ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు, ఏలకులు - 5, నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు, నీరు - తగినన్ని

    తయారు చేసుకునే విధానం -

    ముందుగా నీళ్ళలో 8 గంటల పాటు నానబెట్టి, నీళ్ళు వంచి బియ్యాన్ని ఒక పొడి వస్త్రంపై ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత గ్రైండర్ లో మెత్తని పిండిలా చేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళు, పంచదార లేదా బెల్లం వేసి తీగ పాకంలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఆ పాకంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. నెయ్యివేసి దగ్గరగా అయ్యేదాకా ఉడికించాలి. వేరే పాన్లో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈ ముక్కలను, ఏలకుల పొడిని చలివిడిలో కలుపుకోవాలి. అంతే చలివిడి తయారవుతుంది.

    పులిహోర

    కావలసినవి -

    బియ్యపుపిండి-ఒక కప్పు, చింతపండు-రెండు నిమ్మకాయలంతవి పసుపు-ఒక టేబుల్ స్పూను, వేయించిన వేరుశనగపప్పు-2, 3 టేబుల్ స్పూన్లు ఉప్పు నూనె పోపు కొరకు ఆవాలు - ఒక టీ స్పూను పచ్చి శెనగపప్పు - 1 టేబుల్ స్పూను, జీలకర్ర - 1 టేబుల్ స్పూను ఎండు మిరపకాయలు - 4

    తయారు చేసుకునే విధానం -

    ముందుగ బియ్యం 2 కప్పుల నీళ్ళు పోసి ఉడక పెట్టుకోవాలి. ఉడికించిన అన్నాన్ని పక్కన చల్లార పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. చింతపండు ని వేడి నీళ్ళల్లో నాన పెట్టి రసం తీసి పెట్టుకోవాలి వేరే పాన్ తీసుకుని తగినంత నూనె పోసి కాగాక ఆవాలు వేసుకోవాలి. తరువాత పచ్చి శనగపప్పు ని వేయించాలి. వేగాక జీలకర్రని, వేరుశనగపప్పుని, ఎండు మిరపకాయలని వేసి ఒక నిముషం పాటు వేయించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి. తరువాత చింతపండు రసం ని బాగా కలపాలి.

    వడపప్పు

    కావలసినవి -

    పెసరపప్పు - ఒక కప్పు, కారం పొడి - 1/2 టేబుల్ స్పూను ఉప్పు చిటికెడు, క్యారెట్ తురుము - ఒక టేబుల్ స్పూను పచ్చిమిర్చి తురుము - 1/2 టేబుల్ స్పూను కొత్తిమీర తురుము - 1 టేబుల్ స్పూను

    తయారు చేసుకునే విధానం -

    పప్పును గంట సేపు నానబెట్టి నీరంతా వడకట్టి అందులో కారం, ఉప్పు, క్యారట్ తురుము, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము మీకు కావలసినంత వేసి కలపండి.

    పానకం

    కావలసినవి -

    నీరు - ఒక గ్లాసు, బెల్లం - వంద గ్రాములు మిరియాల పొడి - అర టీ స్పూను, ఏలకుల పొడి - అర టీ స్పూను

    తయారు చేసుకునే విధానం -

    బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి. కరిగాక అందులో మిరియాల పొడిని, యాలకుల పొడిని వేసి కలపాలి.

    తీపి గారెలు

    కావలసినవి -

    మినపప్పు - రెండు కప్పులు, బెల్లం తురుము - 1 1/2 కప్పులు ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - రుచికి కొద్దిగా నీళ్ళు - రెండు కప్పులు, నూనె- గారెలు వేయించడానికి తగినంత

    తయారు చేసుకునే విధానం -

    మినపప్పుని నీటిలో వేసి రెండు

    Enjoying the preview?
    Page 1 of 1