You are on page 1of 16

శ్రీ కృష్ణు డు

వికీపీడియా నుండి

(శ్రీకృష్ణు డు నుండి దారిమార్పు చెందింది)


ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ

కృష్ణు డు

రాధాకృష్ణు లు - 18 వ శతాబ్దా నికి చెందిన


రాజస్థా నీ చిత్రం

దేవనాగరి कृष्ण

కన్నడ ಕೃಷ್ಣ
తమిళ లిపి கிருஷ்ணர்

సంప్రదాయభ
విష్ణు వు పూర్ణా వతారము
ావం

ఆవాసం బృందావనం, గోకులం,


ద్వారక, వైకుంఠం

श्री कृष्णः शरणं ममः, ॐ


మంత్రం
नमो भगवते वासुदेवाय
ఆయుధం సుదర్శన చక్రము

రాధ, రుక్మిణి, సత్యభామ,


జాంబవతి, నాగ్నజితి,
భార్య
లక్షణ, కాళింది, భద్ర,
మిత్రవింద.

వాహనం గరుత్మంతుడు

గ్రంధాలు భాగవతం, భగవద్గీత

ఈ పెట్టె: చూడు • చర్చ • మార్చు

శ్రీకృష్ణు డు, హిందూమతంలో అర్చింబడే ఒక దేవుడు. విష్ణు వు యొక్క పది అవతారాలలో ఒక అవతారము.
హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాధలలోను, సాహిత్యంలోను, ఆచార
పూజా సాంప్రదాయాలలోను కృష్ణు ని అనేక విధాలుగా భావిస్తు ంటారు, చిత్రీకరిస్తు ంటారు. చిలిపి బాలునిగాను,
పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్ట మహిషుల ప్రభువుగాను,
యాదవరాజుగాను, అర్జు నుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబో ధకునిగాను,
తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞు నిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణు ని రూపం,
వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.[1] [2][3]. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణం - ఈ
గ్రంథాలు కృష్ణు ని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.

హిందూమతంలో, ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణు నిపూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మధురలో


బాలకృష్ణు నిగా, పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట ల
్ర ో విఠోబాగా, రాజస్థా న్‌లో శ్రీనాధ్‌జీగా, తిరుమలలో
వేంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణు నిగా, గురువాయూరులో గురువాయూరప్పగా కృష్ణు ని పూజిస్తా రు. ఇంతే
కాకుండా విష్ణు వు ఆలయాలన్ని కృష్ణు ని ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ
ప్రా ంతాలలోను, వర్గా లలోను అనేక సాంప్రదాయాలు నెలకొన్నాయి. వీటిలో ప్రధానమైన భావం:
శ్రీమహా విష్ణు వు తన సృష్టి లోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు,
దుష్టు లను శిక్షించి, శిష్టు లను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ
ఉంటాడు. ఈవిధంగా అవతరించడాన్నిలీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు, భాగవతం ప్రకారం,
భగవంతునికి ఇరువది రెండు(22) ఉన్నాయి. శ్రీమహావిష్ణు వు లీలావతారాలలో ఇరువదవ అవతారం
శ్రీకృష్ణా వతారం. ఈ లీలావతారాలు ఇరవైరెండింటి లోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిని
దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణా వతారం కొన్నిచోట్ల చెప్పబడుతుంది. కొన్నిచోట్ల చెప్పరు
("రామోరామశ్చరామశ్చ"). యుగాలలో రెండవదయిన త్రేతాయుగం లో శ్రీరామునిగా లోక కళ్యాణం చేసిన
నారాయణుడు ఆ తర్వాతదయిన ద్వాపర యుగం లో శ్రీకృష్ణు డిగా అవతరించాడు. గీతోపదేశం ద్వారా
అర్జు నుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రా మాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీత ను
లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణు డు జగద్గు రువు అయ్యాడు.

విషయ సూచిక

[దాచు]

 1 నామాలు, రూపం
 2 జీవితం
o 2.1 జననం
o 2.2 వ్రేపల్లెలో
o 2.3 కుటుంబము
o 2.4 ద్వారకానగరంలో
o 2.5 మహాభారతంలో
o 2.6 నిర్యాణం
 3 చారితక
్ర అంశాలు
 4 ఆరాధన
 5 కొన్ని ప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరాలు
 6 శ్రీకృష్ణా రాధన ద్వారా ప్రసిద్ధు లైనవారు
 7 ఇతర మతాలు, దేశాలలో
 8 ఇవి కూడా చూడండి
 9 మూలాలు
 10 బయటి లింకులు

[మార్చు] నామాలు, రూపం

ఒరిస్సా జగన్నాథ మందిరంలో ఉన్న బలభద్రు డు (బలరాముడు), సుభద్ర, కృష్ణు డు విగ్రహాల నమూనా.

భగవాన్ శ్రీకృష్ణు ని సాధారణ చిత్రీకరణ

"కృష్ణ " అనగా నలుపు అని అర్ధం. [4] కృష్ణు డు నల్ల ని రంగు కలవాడని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు అనేక
వివరణలున్నాయి. మహాభారతం ఉద్యోగపర్వం (5.71.4) ప్రకారం 'కృష్' అనగా దున్నుట (నాగలి మొన నల్ల గా
ఉంటుంది గనుక ఈ పేరు వచ్చింది). భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణు డు (వ్యవసాయానికి
ప్రా ముఖ్యతను తెలిపే పేరు). వల్ల భ సాంప్రదాయం బ్రహ్మసంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే
మంత్రం "కృష్ణ "[5]. చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థ ం ప్రకారం మహాభారత వాక్యం (5.71.4) ఆకర్షించేవాడు
కృష్ణు డు.[6][7] భాగవతం ఆత్మారామ శ్లో కం (1.7.10) లో కూడా ఈ భావం చెప్పబడింది.[8] విష్ణు సహస్రనామం
57 వ పేరుగా వచ్చిన "కృష్ణ " అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించునది అని ఆదిశంకరాచార్యుడు
వివరించాడు. [9] ఇంకా కృష్ణు నికి గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు వంటి అనేకనామాలున్నాయి.[10][11]
జగన్నాథుడు, విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రా ంతాలలో లేదా సంప్రదాయాలలో ప్రా చుర్యం కలిగి ఉన్నాయి.[12]

విష్ణు సహస్రనామ స్తో త్రంలో "కృష్ణ " అనే నామం రెండు సార్లు వస్తు ంది (1) అగ్రా హ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః
ప్రతర్ద నః (2) వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః - ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్త లు
వివిధ భావాలను తెలిపారు. అవి క్లు ప్త ంగా క్రింద ఇవ్వబడినాయి* [13] [14] [15]

1. సృష్ట్యాది లీలావిలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు.


2. నల్ల ని వర్ణ ము కలవాడు. నీలమేఘ శ్యాముడు.
3. తన అనంత కళ్యాణ గుణములతో భక్తు లను ఆకర్షించువాడు.
4. నాగలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు.
5. కృష్ణ ద్వైపాయనుడైన వేదవ్యాసుడు.
6. వ్యాసునిగా వేదములను విభజించి భక్తు లకు మనోవ్యవసాయము కలిగించి జ్ఞా నమును
పండించువాడు.
7. కానరాని, తెలియరాని, అందజాలనివాడు. సంపూర్ణ భక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు.

అనేక దేవాలయాల విగ్రహాలలోను, ఇతర శిల్పాలలోను, చిత్రా లలోను, ప్రా ర్ధ నలలోను, కావ్యాలలోను,
సాహిత్యంలోను, పురాణాలలోను, సినిమాలలోను కృష్ణు ని రూప స్వభావాల చిత్రణ ఉంది. ఉదాహరణగా
"కృష్ణా ష్ట కం" అనే ప్రా ర్ధ నలో కృష్ణు ని వర్ణించిన విధానం - దేవకీవసుదేవుల నందనుడు, కంసచాణూర
మర్ద నుడు, నల్ల ని మేనికాంతి (అతసీపుష్ప సంకాశం) కలవాడు, నెమలి పింఛము, వివిధ ఆభరణములు,
మందారమాల, పీతాంబరములు, తులసి మాలలు ధరించినవాడు, మెలిదిరిగిన ముంగురులు కలవాడు,
రుక్మిణీసత్యభామాది భామలతో విహరించువాడు, గోపికల కుచముల కుంకుమ అంటిన వక్షస్థ లము, శ్రీవత్స
చిహ్నము కలవాడు, వనమాల, శంఖచక్రములు ధరించినవాడు.

తెలుగునాట పో తన భాగవతం అత్యంత ప్రా చుర్యం కలిగిన గ్రంథం. ఇందులో కృష్ణు ని రూప స్వభావ వర్ణ న అనేక
పద్యాలలో ఉంది. పో తన వాడిన కొన్ని వర్ణ నలు - నల్ల నివాడు, పద్మ నయనమ్ములవాడు, నవ్వు రాజిల్లెడు
మోమువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, సుధారసమ్ము పైజల్లెడువాడు, యదుభూషణుడు, నర
(అర్జు నుని) సఖుడు, శృంగార రత్నాకరుడు, లోకద్రో హి నరేంద్ర వంశదాహకుడు, లోకేశ్వరుడు, నిర్వాణ
సంధాయకుడు, భక్త వత్సలుడు, బ్రహ్మణ్యుండు, గోవిందుడు, - పాండవులకు సఖుడు, సారథి, సచివుడు,
నెయ్యము, వియ్యము, విభుడు, గురువు, దేవుడు - ఇలా లెక్కలేనన్ని వర్ణ నలున్నాయి.

అన్నమయ్య చెప్పిన కొన్ని వర్ణ నలు - ముద్దు గారే యశోద ముంగిట ముత్యము, కాళింది పడగలపైని కప్పిన
పుష్యరాగము, రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము

[మార్చు] జీవితం

వివిధ గ్రంథాలలో శ్రీకృష్ణు ని జీవిత వృత్తా ంతం ఉంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం ప్రజలకు
సుపరిచితమైనది. ఇందులో నవమ స్కంధములో వసుదేవుని వంశక్రమం ఉంది. తరువాతదశమ స్కంధము,
ఏకాదశ స్కంధములలో కృష్ణు ని జీవిత వృత్తా ంతము ఉంది. తృతీయ స్కంధములో విదురుడు, ఉద్ధ వుల మధ్య
జరిగిన సంభాషణలో శ్రీకృష్ణు ని జీవిత సంగ్రహం ఉద్ధ వుడు చెప్పాడు. మరియు మహాభారతంలో పాండవుల
లాక్షాగృహదహనానంతరం కృష్ణు ని పాత్ర ప్రవేశం అవుతుంది. అక్కడినుండి కురుక్షేత్ర సంగ్రా మం చివరి వరకు
కృష్ణు ని కధ పాండవుల కధకు సమాంతరంగా నడుస్తు ంది. మహాభారతం చివరిలో కృష్ణు ని నిర్యాణం ఉంది.
భాగవతం కధారంభంలోనే కృష్ణు ని నిర్యాణం చెప్పబడింది. వీటిలోనుండి సంగ్రహింపబడిన కృష్ణు ని కధ క్రింద
ఇవ్వబడింది.

[మార్చు] జననం

శిశువైన కృష్ణు ని తీసుకొని వసుదేవుడు యమునను దాటి వెళ్ళుట - 18 వ శతాబ్దా నికి చెందిన చిత్రం.
లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రా ర్ధ న మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు
జన్మింపదలిచాడు.

మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తు ండేవాడు. ఆయనకు


వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసన
ే మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం
చేస్తా రు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్త వారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే
అశరీరవాణి దేవకి గర్భం లో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తా డు అని చెబుతుంది. కంసుడు
దేవకిని, వసుదేవుడిని, ఆడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహరాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీ దేవి
ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు విష్ణు వు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనం లో నందుడి భార్య
రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తా డు. చెరసాలలో దేవకికి గర్భ
స్రా వం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తు ంది. లక్ష్మీనాథుడు
దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు , యక్ష, కిన్నర ,కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాల కు వచ్చి
స్తు తిస్తా రు.

దేవకి గర్భం నుండి శ్రా వణ శుద్ధ అష్ట మి తిథి నాడు విష్ణు వు శ్రీకృష్ణు డై రోహిణీ నక్షత్ర యుక్త మైనప్పుడు
జన్మిస్తా డు. కృష్ణు డు జన్మించాక వసుదేవుడు కృష్ణు డిని పొ త్తి ళ్ళలో పెట్టు కొని, చెరసాల బయట నిద్ర పో తూ
ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది రెండుగా చీలి
పో తుంది. నందనవనం లో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశం లో
శ్రీకృష్ణు డిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తా డు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు
ఏడుస్తు ంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ
చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పో యి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట
పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీవసుదేవులకు అష్ట మ సంతానంగా కంసుని చెరలో
జన్మించిన శ్రీకృష్ణు డు వ్రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు.

[మార్చు] వ్రేపల్లెలో
కృష్ణు నికి స్నానం చేయిస్తు న్న యశోద - 15 వ శతాబ్ద పు చిత్రం

గోపబాలకుడైన కృష్ణు డు

మధురానగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణు డు పుట్ట గానే తన తండ్రి వసుదేవునిచే వ్రేపల్లె లోని
నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డ గా బాల్య జీవితము గడిపాడు. పాలుత్రా గే ప్రా యంలో తనను
చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను, బుడిబుడి నడకల ప్రా యంలో శకటాసురాదులను
సంహరించాడు. చిరు ప్రా యంలో యశోదకు తననోటిలో అండ పిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను
ఆనందాశ్చర్యచకితురాలిని చేశాడు. దో గాడే వయసులో యశోదచే నడుముకి కట్ట బడిన రోలుతో రెండు మద్ది
చెట్లను కూల్చి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం గావించాడు.

అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు. వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి


ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధు లను గావించాడు. కాళిందీనదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యముచేసి
"తాండవకృష్ణు డు" అయ్యాడు. కాళీయుని మదమణచి, కాళిందిని విడిచి దూరంగా పంపి వ్రేపల్లె వాసుల
మన్ననలను పొ ందాడు. ప్రళయకాలంలో గోవర్ధ న గిరిని తన చిటికెన వేలుతో ఎత్తి వ్రేపల్లె వాసులను ఆ గిరి
కిందకు చేర్చికాపాడి వ్రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థా యికి ఎదిగాడు. అల్ల రి పనులతో అలరించి,
ఆపత్కాలంలో ఆదుకుని, ధైర్యసాహసాల ప్రదర్శనతో వ్రేపల్లెను మురిపించాడు.

కృష్ణు ని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని, ఉద్ధ వుని దూతగా పంపి, కృష్ణ బలరాములను మధురకు
రప్పించాడు. బలరామకృష్ణు లు చాణూర ముష్టికులనే మల్లు లను, తరువాత కంసుని వధించి తమ తాత
ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తు ని గావించారు. చెరలోఉన్న తల్లి, తండ్రు లను వారితో పాటుగా
విడిపంి చి ద్వారకకు చేరుకున్నారు.

దేవకీ వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమము చేరుకొని అక్కడ కుచేలుని చెలిమిని
పొ ందారు. గురుదక్షిణగా అంతకుపూర్వమే మరణించిన గురుపుత్రు ని బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించారు.
విద్యాధనంతో తన తల్లి తండ్రు లవద్ద కు చేరుకున్నారు.

[మార్చు] కుటుంబము

దేవకీ వసుదేవులు కృష్ణు ని తల్లిదండ్రు లు. అన్న బలరాముడు. చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణ బలరాములు
యశోదా నందులవద్ద వ్రేపల్లెలో పెరిగారు. కృష్ణు ని తమ్ముడు సాత్యకి.

ముఖ్య వ్యాసము: అష్టమహిషులు

ముఖ్య వ్యాసము: కృష్ణసంతానం

శ్రీకృష్ణు డు అష్ట భార్యలను వివాహమాడాడు. విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణు ని ప్రేమించింది. కానీ
ఆమె సో దరుడు రుక్మి అతడిని ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెండ్లి చేయాలని నిశ్చయించాడు. రుక్మిణి
పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణు డు ఆమె అభీష్ట ం మేరకు రాక్షస పద్ధ తిలో అపహరించి వివాహం
చేసుకుంటాడు. సత్రా జిత్తు కుమార్తె సత్యభామ. కృష్ణు డు శ్యమంతక మణి ని తనకిమ్మని కోరగా అతడు
అంగీకరించలేదు. ఒకసారి సత్రా జిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక
సింహము అతనిని చంపి, మణిని హరించింది. జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె
జాంబవతి కిచ్చాడు. మణి కొరకై ప్రసేనుడిని కృష్ణు డే హతమార్చెనన్న అపవాదు వ్యాపించింది. కృష్ణు డు మణిని
అన్వేషిస్తు పో యి పో యి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు. జాంబవంతునికీ, కృష్ణు నికీ
జరిగిన యుద్ధ ంలో జాంబవంతుడు పరాజితుడైనాడు. శ్రీకృష్ణు ని శ్రీరాముని అవతారంగా గుర్తించిన
జాంబవంతుడు మణితో సహా కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు. మణిని తెచ్చి
సత్రా జిత్తు నకిచ్చినాడు. అప్పుడు సత్రా జిత్తు మణితోపాటు తన కుమార్తె సత్యభామను కృష్ణు నికిచ్చి వివాహం
చేసెను.
కాళింది, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద మరియు లక్షణ అతని ఇతర భార్యలు. భద్ర శ్రీకృష్ణు ని తండ్రియగు
వసుదేవుని చెల్లెలైన శ్రు తకీర్తి పుత్రిక. మిత్రవింద కూడా అవంతీ రాజు పుత్రిక, మేనత్త కూతురు. ఆమెను
స్వయంవరంలో వరించి కృష్ణు డు చేపట్టా డు. కోసల దేశాధిపతి నగ్నజిత్తు కు ఏనుగుల వంటి బలం కలిగిన ఏడు
వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి తన కుమార్తె నాగ్నజితి ని ఇచ్చి వివాహం చేస్తా నని
ప్రకటించాడు. కృష్ణు డు ఏడు రూపాలు దాల్చి ఏడు ఎద్దు లను బంధించాడు. రాజు పుత్రికనిచ్చి పరిణయం
చేశాడు. లక్షణ మద్ర దేశాధిపతి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణు ని వరించింది. ఈ విధంగా కృష్ణు ని
ఎనమండుగురు భార్యలు అష్ట మహిషులుగా విలసిల్లా రు.

సుభద్రను అర్జు నునికి ఇచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు అభిమన్యుడు (కృష్ణు నికి మేనల్లు డు)

శ్రీకృష్ణు డికిభార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టా రు. రుక్మిణి వల్ల కృష్ణు డికి
ప్రద్యుమ్నుడు, చారుదేష్ణు డు, సుదేష్ణు డు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తు డు, భద్రచారుడు,
చారుచంద్రు డు, విచారుడు, చారుడు అనే బిడ్డ లు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణు నికి భానుడు, సుభానుడు,
స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు,
ప్రతిభానుడు అనే బిడ్డ లు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణు లకు సాంబుడు, సుమిత్రు డు, పురజిత్తు , శతజిత్తు ,
సహస్రజిత్తు , విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది.
జాంబవతికి కలిగిన ఈ బిడ్డ లంటే కృష్ణు డికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.నాగ్నజితి, కృష్ణు లకు వీరుడు, చంద్రు డు,
అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.
కృష్ణు డికి కాళింది వల్ల శ్రు తుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రు డు, శాంతి, దర్శుడు,
పూర్ణ మానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణు డికి ప్రఘోషుడు, గాత్రవంతుడు,
సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం
కలిగింది. మిత్రవింద, కృష్ణు లకు వృకుడు, హర్షు డు, అనిలుడు, గృద్ధు డు, వర్ధ నుడు, అన్నాదుడు, మహాశుడు,
పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రు లు పుట్టా రు. కృష్ణు డికి భద్ర అనే భార్య వల్ల సంగ్రా మజిత్తు , బృహత్సేనుడు,
శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు , జయుడు, సుభద్రు డు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు
పుట్టా రు. ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణు డి భార్యల ద్వారా కూడా
ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది.

[మార్చు] ద్వారకానగరంలో
ఒకమారు పారిజాత పుష్పం కారణంగా కృష్ణు డు ఇంద్రు నితో పో రి స్వర్గ లోకంనుండి పారిజాతతరువును తెచ్చి
సత్యభామకు ప్రీతికూర్చాడు. లోకాళను బాధిస్తు న్న నరకాసురుని వధించి అతని కొడుకు భగదత్తు నికి పట్ట ం
కట్టా డు. నరకునిచే బంధింపబడిన రాజకన్యలను కృష్ణు డు పెండ్లా డి అందరిపట్ల తనమాయాప్రభావంతో
సంసారం నెరపాడు.

శ్రీకృష్ణు ని అతిశయాన్ని చూసి ఓర్వలేక కాలయవనుడు, జరాసంధుడు, సాళ్వుడు వంటివారు కృష్ణు నిపై
దండెత్తా రు. శ్రీకృష్ణు డు వారిని ఓడించాడు. ఇంకా ద్వివిదుడు, దంతవక్త్రు డు మొదలైనవారు కూడా కృష్ణు ని చేత
హతులైనారు.

[మార్చు] మహాభారతంలో

కురుక్షేత్రం యుద్ధ సమయంలో శ్రీ కృష్ణు డు అర్జు నునికి గీతాబో ధ చేయటం

మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీ కృష్ణు ని అనుబంధం మరువరానిది. పాండవ మధ్యముడైన


అర్జు నునితో చెలిమి విడదీయరానిది. పాండవుల జీవితములో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణు ని పాత్ర ఉంది.
శ్రీకృష్ణు ని సంప్రదించకుండా దర్మరాజు శకునితో ఆడిన జూదము తప్పమిగిలినవన్నీ శ్రీకృష్ణు ని సలహా
సంప్రదంి పులతో జరిగినవే. కీలకమైన సమస్యలన్నీ కృష్ణు ని సహాయంతో తీరినవే. ద్రౌ పదిని శ్రీకృష్ణు డు స్వంత
చెల్లెలికన్నామిన్నగా చూసుకున్నాడు. వస్ర్తాపహరణ అవమానమునుండి ఆమె శ్రీకృష్ణు ని సహాయంతోనే
బయటపడింది. పాండవవనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణు ని సలహాతో
పరిష్కారం చేసుకున్నారు. వారి రాజ్యం మీదకు అనేకమార్లు దండెత్తి న జరాసంధుని భీముని సాయంతో
తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు. ద్వారక సముద్రగర్భంలో మునిగిపో తుందని
ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్త ంచేసి వారిని ఆపదనుండి రక్షించాడు. ఇంద్రపస
్ర ్థ ం లో
ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ సమయంలో మేనత్త కి ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని నూరు
తప్పులను సహించిన తరువాత అతనిని చక్రా యుధంతో వధించాడు.

పాండవుల వనవాసం తరువాత వారి తరఫున కురుసభలో రాయబారము చేశాడు. కురుక్షేత్రం లో


యుద్ధ సమయంలో అర్జు నునికి గీతాభోధ చేసి అతనిని యుద్ధోన్ముఖుని చేశాడు. అర్జు నునికి సారధియై
యుద్ధ ం ముగిసేవరకూ పాండవులకు రక్షణగా ఉన్నాడు. అశ్వత్థా మ అస్త ం్ర వల్ల ఉత్త ర గర్భంలో పిండం కూడా
మృత్యవును ఎదుర్కోగా కృష్ణు డు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు. ఆ శిశువే పరీక్షిత్తు గా జన్మించి
పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు.

[మార్చు] నిర్యాణం

మహాభారత యుద్ధా నంతరం యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తు ందని గాంధారి శపించింది. అలాగే
యాదవకులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం ( రోకలి ) అందరి మరణానికీ
కారణమయ్యింది. బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణు డు అరణ్యాలకు వెళ్ళాడు.
అక్కడినుండి కృష్ణు డు స్వర్గా నికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది. అయితే ఒక నిషాదుని (
పూర్వజన్మలో అంగదుడు ) బాణం వలన కృష్ణు డు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో
ఉంది. [16][17][18]

పురాణాలలో తెలిపిన ప్రకారం [19] శ్రీకృష్ణు ని నిర్యాణంతో ద్వాపరయుగం అంతమయింది. కలియుగం


ఆరంభమయింది. ఇది క్రీ.పూ. 3102 ఫిబవ
్ర రి 17/18 తేదీలలో జరిగిందని కొన్ని అంచనాలున్నాయి[20] (అయితే
ఈ అంచనాలలో పలు అభిప్రా య భేదాలున్నాయి)
రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు, గౌడీయ వైష్ణవుల విశ్వాసం ప్రకారం శ్రీకృష్ణు డు జరామరణ
రహితుడు. మహాభారతంలో యుద్ధ ఘట్ట ం వర్ణ నలో కొన్నిచోట్ల శ్రీకృష్ణు డి దేహం గాయపడినట్లు వర్ణించినా గాని,
మరికొన్ని ఘట్టా లలో అతను చరాచరవిశ్వాత్మకుడని, ఆదిమధ్యాంతరహితుడని, సామాన్యమైన పాంచభౌతిక
దేహానికి అతీతుడనీ గ్రహించాలి.[21] ఇదే విషయాన్ని కృష్ణు డు ఉద్యోగపర్వంలో చెప్పాడు కూడాను. [22]

[మార్చు] చారిత్రక అంశాలు

ఉత్త ర ప్రదేశ్ లోని మీర్జా పూర్‌లో లభించిన క్రీ.పూ. 800 నాటి ఒక చిత్రంలో సుదర్శన చక్రం ధరించిన రథసారథిని
కృష్ణు డని అనుకోవచ్చును. [23]

కృష్ణు ని గురించిన ప్రస్తా వన లభించిన మొట్ట మొదటి గ్రంథం ( చరిత్ర కారుల అంచనా ప్రకారం )
ఛాందో గ్యోపనిషత్తు . ఇందులో కృష్ణు డు దేవకి సుతుడని, ఘోర అంగీరసుని శిష్యుడని చెప్పబడింది.[24][25]
"నారాయణ అధర్వశీర్ష", "ఆత్మబో ధ" వంటి ఉపనిషత్తు లలో కృష్ణు డు భగవంతుడని, నారాయణుని
అవతారమని చెప్పబడింది.[24]

తైత్తరీయారణ్యకము (X,i,6) లో వాసుదేవుడు, నారాయణుడు, విష్ణు వుల గురించిన ప్రస్తా వన ఉంది. క్రీ.పూ.
4 వ శతాబ్ది కి చెందిన వ్యాకరణకర్త పాణిని "అష్టా ధ్యాయి"లో"వాసుదేవకుడు" అనగా "వాసుదేవుని భక్తు డు"
అని తెలిపాడు. [26] అదే సందర్భంలో అర్జు నుని ప్రస్తా వన కూడా ఉండడం వలన ఈ వాసుదేవుడే కృష్ణు డు
అనుకొనవచ్చును.[27] వేదకాలంలో ఎప్పుడో "వాసుదేవుడు", "కృష్ణు డు" ఒకరిగా భావింపబడడం
మొదలయ్యుండవచ్చును. ప్రస్తు తం మనకు లభిస్తు న్న మహాభారతం కాలం నాటికి కృష్ణు డు విష్ణు వు
అవతారమనే భావన స్థిరపడింది.[24]

మధురలో ఉండే శూరసేనుడు "హెరాకిల్స్"ను పూజించాడని క్రీ.పూ. 4 వ శతాబ్ద ంలో చంద్రగుప్తు ని ఆస్థా నాన్ని
దర్శించిన మెగస్త నీస్ వ్రా శాడు. మెగస్త నీస్ వ్రా సిన ఇతర వ్రా తలను బట్టి "హెరాకిల్స్" మరియు "కృష్ణు డు"
ఒకరే అనుకోవచ్చును.[28]. క్రీ.పూ. 180-165 కాలంలో గ్రీకో-బాక్ట్రియన్ పాలకుడు "అగాథకిల్స్" (Agathocles)
కృష్ణ బలరాములున్న నాణేలను ముద్రించాడు.
చితోర్ ఘర్ జిల్లా నగరి వద్ద ఘోసుండి మరియు హాథిబాడలలో లభించిన క్రీ.పూ. 2 వ శతాబ్ద ం నాటి శాసనాల
ప్రకారం - సంకర్షణ (బలరాముడు), వాసుదేవులను (కృష్ణు డు) పూజించడం కోసం గజాయనసర్వతాత అనే
రాజు "నారాయణ వటం"లో ఒక "పూజా శిలా ప్రా కారం" (గుడి వంటిది) నిర్మించాడు. [28][29] అదే కాలంనాటి
శాతవాహనుల శాసనాలలో కూడా ఇతర దేవతలో పాటు సంకర్షణ, వాసుదేవుల ప్రస్తు తి ఉంది.[30]

క్రీ.పూ. 110 లో భాగవత ధర్మాన్ని అవలంబించిన హెలిడో రస్ వేయించిన శాసనం

క్రీ.పూ. 1 వ శతాబ్ద ంలో గ్రీస్‌కు చెందిన హెలిడో రస్ (Heliodorus) భిల్సా సమీపంలో బేసన్‌గర్ వద్ద ఒక స్త ంభ
శాసనాన్ని (Heliodorus pillar) వేయించాడు. ఆ శాసనంపై వ్రా సిన విషయం:[28] " దేవదేవుడైన వాసుదేవుని
కొఱకు ఈ గరుడ స్త ంభాన్ని వేయించిన భాగవత ప్రభువు భక్తు డు హెలియోడో రస్. అతను తక్షశిలకు చెందిన
గ్రీకు వ్యక్తి (Diya Greek Dion) కొడుకు మరియు గ్రీకుమహారాజు అంటాలికిట (Great King Amtalikita
[Greek Antialcidas]) రాయబారిగా కాశీపుత్రభగభద్రు ని ఆస్థా నానికి వచ్చియున్నాడు. కాశీపుత్ర భగభద్రు డు
తన 14 వ సంవత్సరపు పాలనలో ఉన్నాడు. [...] మూడు అమృత ధర్మాలు [...] పాటిస్తే స్వర్గా నికి మార్గ ం
లభిస్తు ంది. ఆత్మ సంయమనం, దానగుణం, శ్రమ". ఇలాగే ఇదే కాలానికి చెందిన మరికొన్ని శాసనాలు
లభించాయి.[31][32]

క్రీ.పూ. 150 కాలానికి చెందిన వ్యాకరణకర్త పతంజలి రచనలలో కృష్ణు డు, సంకర్షణుడు, జనార్ద నుడు,
బలరాముడు, కేశవుడు వంటి దేవతల ప్రస్తా వనలున్నాయి. క్రీ.పూ. 1 వ శతాబ్ద ంలో వృష్ణివంశానికి ఐదుగురు
వీరుల పూజ గురించి ( బలరాముడు, కృష్ణు డు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధు డు, సాంబుడు ) ప్రస్తా వన ఉన్న
శాసనం మధుర సమీపంలో "మోరా" వద్ద లభించింది.

[మార్చు] ఆరాధన
శ్రీవైష్ణవం
కృష్ణ భక్తి
హరేకృష్ణ ఉద్యమం

[మార్చు] కొన్ని ప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరాలు

 పూరి, ఒరిస్సా - జగన్నాథ మందిరం


 గురువాయూరు, కేరళ - గురువాయూరప్ప మందిరం
 నాథద్వార, గుజరాత్ - శ్రీనాధ్ జీ మందిరం
 మధుర, బృందావనం -ఉత్త ర ప్రదేశ్
 ఉడిపి - కర్ణా టక
 ద్వారక - గుజరాత్
 మన్నార్ గుడి - తమిళనాడు - రాజగోపాల మందిరం
 హరేకృష్ణ మందిరాలు - మాయాపూర్, బెంగళూరు, ముంబై, తిరుపతి
 తిరుమల - వెంకటేశ్వరస్వామిగా

[మార్చు] శ్రీకృష్ణా రాధన ద్వారా ప్రసిద్ధు లైనవారు

 మీరాబాయి
 చైతన్యప్రభు
 సూరదాసు
 మధ్వాచార్యుడు
 భక్తి వేదాంత ప్రభుపాద

[మార్చు] ఇతర మతాలు, దేశాలలో

[మార్చు] ఇవి కూడా చూడండి

 దశావతారములు
 మహాభాగవతం
 భగవద్గీత

You might also like